శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల డిసెంబరు కోటాను సెప్టెంబరు 18న ఉదయం 10 గంటలకు తితిదే ఆన్లైన్లో విడుదల చేయనుంది.
వీటి లక్కీడిప్ రిజిస్ట్రేషన్ కోసం ఇదే నెల 20న ఉదయం పది గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు.
అంగప్రదక్షిణ టోకెన్లను ఈ నెల నుంచి ఆన్లైన్లో లక్కీడిప్ ద్వారా జారీ చేయనున్నారు.
20వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్లో టికెట్లు మంజూరవుతాయి.
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లు 22న ఉదయం పదింటికి, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను మధ్యాహ్నం మూడింటికి అందుబాటులో ఉంచనున్నారు.
23న ఉదయం 11గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం టికెట్ల కోటా.. మధ్యాహ్నం మూడింటికి వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేయనున్నారు.
24న ఉదయం పదింటికి రూ.300 టికెట్ల కోటా, మధ్యాహ్నం మూడింటికి అద్దె గదుల బుకింగ్ కోటా ఉంటుంది.
భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్లో మాత్రమే ఆయా టికెట్లను బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
No comments:
Post a Comment